ఫోర్బ్స్-30లో ఐదుగురు హైదరాబాదీలు
ABN , First Publish Date - 2020-04-03T12:01:23+05:30 IST
ఫోర్బ్స్-30లో ఐదుగురు హైదరాబాదీలు
అభినందించిన మంత్రి కేటీఆర్
హైదరాబాద్(ఆంధ్రజ్యోతి): ఆసియాలోని 30 సంవత్సరాల లోపు టాప్ 30 యువ పారిశ్రామికవేత్తల్లో ఐదుగురు హైదరబాదీలకు స్థానం దక్కింది. ఫోర్బ్స్ విడుదల చేసిన ఈ జాబితాలో ప్రేమ్ కుమార్ (మారుత్ డ్రోన్స్), అశ్విన్ మోచర్ల (ది థిక్ షేక్ ఫ్యాక్టరీ), సందీప్ బొమ్మి (యాడ్ ఆన్ మో), విహారి (అర్బన్ కిసాన్), పవన్ కుమార్ చందన (స్కై రూట్ ఏరోస్పేస్) ఉన్నారు. ఇప్పటికే వీరి స్టార్టప్ కంపెనీలకు ఫండింగ్తో పాటు అనేక అవార్డులు కూడా లభించాయి. వీరికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే. తారకరామారావు అభినందనలు తెలియజేశారు. ఆసియా వ్యాప్తంగా 30 మంది యువ పారిశ్రామిక వేత్తలను ఫోర్బ్స్ గుర్తిస్తే అందులో ఐదుగరు హైదరాబాదీలు ఉండడడం గర్వకారణమని మంత్రి ప్రశంసించారు. వీరంతా మరిన్ని విజయాలు సాధించాలని మంత్రి కేటీఆర్ ఆశించారు.