Godavari Flood: దవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
ABN , First Publish Date - 2022-08-10T16:26:14+05:30 IST
భారీ వర్షాల కారణంగా గోదావరి వరద ఉధృతి ఎక్కువగా ఉంది. దీంతో అధికారులు దవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.
అమరావతి: భారీ వర్షాల కారణంగా గోదావరి వరద (Godavari flood) ఉధృతి ఎక్కువగా ఉంది. దీంతో అధికారులు దవళేశ్వరం (Dhavaleshwaram) వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 10.27 లక్షల క్యూసెక్కులుగా కొనసాగుతోంది. గోదావరి ఉధృతి నేపథ్యంలో ఏపీ వివపత్తుల సంస్థ అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తోంది. అత్యవసర సహయం, సమాచారం కోసం 24 గంటలు అందుబాటులో స్టేట్ కంట్రోల్ రూమ్ నెంబర్లు (1070, 18004250101, 08632377118) సంప్రదించాలని తెలిపారు. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల సంస్థ ఎండీ డా.బి.ఆర్.అంబేద్కర్ సూచించారు.