ఆర్థిక సాయం చేయండి

ABN , First Publish Date - 2020-07-11T08:43:10+05:30 IST

ఏపీకి ఆర్థిక సాయం అందించాలని, పోలవరానికి ఖర్చు చేసిన నిధులను రీయింబర్స్‌

ఆర్థిక సాయం చేయండి

  • కేంద్రానికి ఆర్థికమంత్రి బుగ్గన వినతి

న్యూఢిల్లీ, జూలై 10(ఆంధ్రజ్యోతి): ఏపీకి ఆర్థిక సాయం అందించాలని, పోలవరానికి ఖర్చు చేసిన నిధులను రీయింబర్స్‌ చేయాలని రా ష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి... కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌, సహాయ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌, జ లశక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌, హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డిని వేర్వేరు గా కలుసుకొన్నారు. ఈ సందర్భంగా బుగ్గన మాట్లాడుతూ... పోలవరం ప్రాజెక్టు, వెనుకబడిన ప్రాంతాలకు నిధులు, జీఎస్టీ బకాయిలు, విభజన చట్టంలో పేర్కొన్న అభివృద్ధి కార్యక్రమాలు, ఆహార ధాన్యాల పంపిణీ తదితర అంశాలపై నిర్మలా సీతారామన్‌తో చర్చించినట్లు చెప్పారు.  

Updated Date - 2020-07-11T08:43:10+05:30 IST