గ్రాన్యూల్స్ తుది డివిడెండ్ 25శాతం
ABN , First Publish Date - 2020-06-03T05:57:43+05:30 IST
గత ఆర్థిక సంవత్సరానికి గ్రాన్యూల్స్ ఇండియా వాటాదారులకు 25 శాతం తుది డివిడెండ్ను ప్రకటించింది. రూపాయి ముఖ విలువ కలిగిన షేరుపై 25 పైసల డివిడెండ్ను బోర్డు సిఫారసు చేసినట్లు కంపెనీ వెల్లడించింది...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): గత ఆర్థిక సంవత్సరానికి గ్రాన్యూల్స్ ఇండియా వాటాదారులకు 25 శాతం తుది డివిడెండ్ను ప్రకటించింది. రూపాయి ముఖ విలువ కలిగిన షేరుపై 25 పైసల డివిడెండ్ను బోర్డు సిఫారసు చేసినట్లు కంపెనీ వెల్లడించింది. కాగా మార్చితో ముగిసిన త్రైమాసికానికి ఏకీకృత ప్రాతిపదికన కంపెనీ లాభం రూ.92.3 కోట్లకు పెరిగింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే లాభం 44 శాతం అధికం. సమీక్ష త్రైమాసికానికి కార్యకలాపాల ద్వారా ఆర్జించిన ఆదాయం 2.2 శాతం తగ్గి రూ.613 కోట్ల నుంచి రూ.600 కోట్లకు చేరింది.