మనోవేదనతో ఫీల్డ్ అసిస్టెంట్ మృతి
ABN , First Publish Date - 2021-03-06T01:07:46+05:30 IST
ఉద్యోగం పోయిందనే మనోవేదనతో ఫీల్డ్ అసిస్టెంట్ మృతి
సూర్యాపేట: ఉద్యోగం పోయిందనే మనోవేదనతో ఫీల్డ్ అసిస్టెంట్ మృతి చెందాడు. బాలెంలలో ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్గా బిక్షం పనిచేస్తున్నాడు. అయితే ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల నుంచి ప్రభుత్వం తొలగించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాడు. దీంతో ఉద్యోగం పోయిందనే మనోవేదనతో బిక్షం మృతి చెందాడు. బిక్షం మృతితో కుటుంబం దిక్కులేని దానిలా మారింది.
మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుని, రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని కలెక్టర్ ఎదుట మృతదేహంతో కుటుంబసభ్యులు ఆందోళన చేశారు. ఫీల్డ్ అసిస్టెంట్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.