‘ఆరోలైఫ్‌’ యూనిట్‌కు హెచ్చరిక లేఖ

ABN , First Publish Date - 2020-10-23T06:12:05+05:30 IST

అరబిందో గ్రూప్‌ కంపెనీ ఆరోలైఫ్‌ ఫార్మా ఎల్‌ఎల్‌సీకి యూఎ్‌స ఎ్‌ఫడీఏ హెచ్చరిక లేఖ జారీ చేసింది...

‘ఆరోలైఫ్‌’ యూనిట్‌కు హెచ్చరిక లేఖ

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): అరబిందో గ్రూప్‌ కంపెనీ ఆరోలైఫ్‌ ఫార్మా ఎల్‌ఎల్‌సీకి చెందిన ఓరల్‌ సాలిడ్‌  ఔషధాల తయారీ యూనిట్‌కు యూఎ్‌స ఎ్‌ఫడీఏ హెచ్చరిక లేఖ జారీ చేసింది. న్యూజెర్సీలోని డైటాన్‌లో ఈ తయారీ యూనిట్‌ ఉంది. జూన్‌4న ఈ యూనిట్‌కు ఓఏఐ స్టేట్‌సను ఇచ్చింది. తాజాగా వార్నింగ్‌ లెటర్‌ జారీ చేసింది. ఈ లెటర్‌ వల్ల యూనిట్‌కు చెందిన ప్రస్తుత వ్యాపారంపై ఎటువంటి ప్రతికూల ప్రభావం ఉండబోదని అరబిందో ఫార్మా తెలిపింది. ఎఫ్‌డీఏ తెలిపిన లోపాలను నిర్ణీత సమయంలో సరి చేస్తామని పేర్కొంది. 


ఇంజెక్షన్‌కు అనుమతి: నొప్పి తగ్గించే ఇంజెక్షన్‌ అసిటామైనోఫెన్‌ తయారీ, అమెరికా మార్కెట్లో విక్రయించడానికి ఎఫ్‌డీఏ నుంచి అరబిందో అనుమతి పొందింది. ఈ ఇంజెక్షన్‌ను డిసెంబరులో మార్కెట్లోకి విడుదల చేయనుంది. 

గ్రాన్యూల్స్‌ ఔషధానికి కూడా: హైపోకాలేమియా చికిత్సకు వినియోగించే పొటాషియం క్లోరైడ్‌ ఎక్స్‌టెండెడ్‌ రిలీజ్‌  ట్యాబ్లెట్లను అమెరికా మార్కెట్లో విక్రయించేందుకు ఎఫ్‌డీఏ నుంచి గ్యాన్యూల్స్‌ అనుమతి పొందింది.  

Updated Date - 2020-10-23T06:12:05+05:30 IST