ఏరువాక సాగిన రైతన్న

ABN , First Publish Date - 2020-06-06T09:52:23+05:30 IST

ఏరువాక పౌర్ణమి సందర్భంగా శుక్రవారం రైతులు పొలం పనులకు శ్రీకారం చుట్టారు. నైరుతి రుతుపవనాలు ఇంకా రాష్ట్రానికి రాకపోయినా, మంచిరోజని కొందరు అరకలు పట్టి పొలాలు దున్నారు. రైతుల పండుగగా గ్రామాల్లో

ఏరువాక సాగిన రైతన్న

అమరావతి, జూన్‌ 5 (ఆంధ్రజ్యోతి): ఏరువాక పౌర్ణమి సందర్భంగా శుక్రవారం రైతులు పొలం పనులకు శ్రీకారం చుట్టారు. నైరుతి రుతుపవనాలు ఇంకా రాష్ట్రానికి రాకపోయినా, మంచిరోజని కొందరు అరకలు పట్టి పొలాలు దున్నారు. రైతుల పండుగగా గ్రామాల్లో నిర్వహించే ఏరువాకను లాక్‌డౌన్‌ నిబంధనల కారణంగా ఉత్సవంగా నిర్వహించలేకపోయారు. గతంలో టీడీపీ ప్రభుత్వం ఏటా గ్రామగ్రామాన ఏరువాక ఉత్సవాలను నిర్వహించింది. గతేడాది నామమాత్రంగా జరిపిన కార్యక్రమాన్ని ఈసారి ప్రభుత్వ పరంగా నిర్వహించకపోవడం రైతులకు నిరుత్సాహం కలిగించింది.

Updated Date - 2020-06-06T09:52:23+05:30 IST