278వ రోజుకి చేరుకున్న రాజధాని రైతుల నిరసనలు

ABN , First Publish Date - 2020-09-20T15:02:31+05:30 IST

రాజధాని కోసం అమరావతి ప్రాంత రైతులు చేస్తున్న ఉద్యమం ఆదివారం నాటికి..

278వ రోజుకి చేరుకున్న రాజధాని రైతుల నిరసనలు

అమరావతి: రాజధాని కోసం అమరావతి ప్రాంత రైతులు చేస్తున్న ఉద్యమం ఆదివారం నాటికి 278వ రోజుకి చేరుకుంది. మందడం, తుళ్లూరు, వెలగపూడి, వెంకటపాలెం, కృష్ణాయపాలెం, ఎర్రబాలెం, ఐనవోలు, ఉద్దండరాయునిపాలెం, పెడపరిమి, దొండపాడు, నేలపాడు, ఆనంతవరం శిబిరాల్లో రైతులు, మహిళలు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. కరోనా నేపథ్యంలో నిబంధనలు పాటిస్తూ నిరసనలు తెలుపుతున్నారు. అమరావతిని రాజధానిగా కొనసాగిస్తామని ప్రభుత్వం ప్రకటించేవరకు తమ ఉద్యమం కొనసాగుతుందని రైతులు స్పష్టం చేశారు.

Updated Date - 2020-09-20T15:02:31+05:30 IST