రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి: కోదండరెడ్డి

ABN , First Publish Date - 2020-04-03T07:43:23+05:30 IST

‘‘పండ్లు, కూరగాయలు, పూలు, ఆకుకూరలను మార్కెట్లకు తీసుకొచ్చేందుకు వీలుగా రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని ఏఐసీసీ కిసాన్‌ కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు...

రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి: కోదండరెడ్డి

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 2(ఆంధ్రజ్యోతి): ‘‘పండ్లు, కూరగాయలు, పూలు, ఆకుకూరలను మార్కెట్లకు తీసుకొచ్చేందుకు వీలుగా రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని ఏఐసీసీ కిసాన్‌ కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి డిమాండ్‌ చేశారు. పంట ఉత్పత్తులను రైతుబజార్లు, కాలనీల్లో విక్రయించుకునేందుకు అవకాశం కల్పించాలని కోరారు. వరి, మొక్కజొన్నతోపాటు మద్దతు ధరల జాబితాలో ఉన్న ప్రతి పంటనూ ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కిసాన్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు అన్వే్‌షరెడ్డి డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2020-04-03T07:43:23+05:30 IST