పిడుగుపాటుకు ముగ్గురు రైతుల మృతి

ABN , First Publish Date - 2022-08-03T05:48:55+05:30 IST

పిడుగుపాటుకు ముగ్గురు రైతుల మృతి

పిడుగుపాటుకు ముగ్గురు రైతుల మృతి

భూపాలపల్లి జిల్లాలో వేర్వేరు ఘటనలు

రేగొండ/మల్హర్‌/చిట్యాల, ఆగస్టు 2: పిడుగుపాటుకు ముగ్గు రు రైతులు మృతి చెందిన సంఘటనలు భూపాలపల్లి జిల్లాలో మంగళవారం వేర్వేరుగా చోటుచేసుకున్నాయి. రేగొండ మండ లం పొనగల్లుకు చెందిన వంగ రవి(50) తన వ్యవసాయ భూ మిలో పనులు చేస్తుండగా భారీ వర్షం కురిసింది. ఈ క్రమం లోనే పిడుగు పడి అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృ తుడికి భార్యప్రమిల, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. మల్హర్‌ మండలం తాడిచర్ల గ్రామ పంచాయతీ పరిధి శాత్రా జ్‌పల్లికి చెందిన కాటం రఘుపతిరెడ్డి (25) తమ వ్యవసాయ భూముల్లో కుటుంబ సభ్యులతో కలిసి నాటు వేస్తుండగా పిడు గుపాటుకు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తండ్రి కాటంరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొయ్యూర్‌ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. చిట్యాల మండలం గోపాలపురం గ్రా మానికి చెందిన ఆరెపల్లి వరమ్మ (56) తన సొంత పత్తి చేనుకు వెళ్తుండగా పిడుగుపాటుకు గురైంది. దీంతో ఆమె అక్క డికక్కడే మృతి చెంది. మృతురాలికి భర్త నర్సయ్య, ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు.

Updated Date - 2022-08-03T05:48:55+05:30 IST