‘రుయా’లో వాస్తవాలు చెప్పాలి: ఏపీసీఎల్సీ
ABN , First Publish Date - 2021-05-15T09:41:31+05:30 IST
తిరుపతిలోని రుయా హాస్పటల్ ఘటనలో మృతుల సంఖ్యపై వాస్తవాలు చెప్పాలని ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు వి.చిట్టిబాబు, కార్యదర్శి చిలుకా చంద్రశేఖర్లు..
పిడుగురాళ్ల, మే14: తిరుపతిలోని రుయా హాస్పటల్ ఘటనలో మృతుల సంఖ్యపై వాస్తవాలు చెప్పాలని ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు వి.చిట్టిబాబు, కార్యదర్శి చిలుకా చంద్రశేఖర్లు శుక్రవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వాస్తవ మరణాలకు, అధికారుల లెక్కలకు ఎంతో వ్యత్యాసం ఉందని, ఇటువంటి ఘోరం జరిగినప్పుడు వాస్తవాలు బయటకు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రభుత్వ అధికారులు తెలిపిన మృతుల సంఖ్య ఒకలా ఉంటే... ప్రతిపక్షాలు చిరునామాలతోసహా ఇచ్చిన మృతుల జాబితాలు మరోలా ఉందని... వీటిలో ఏది వాస్తవమో తెలపాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే న్యాయవిచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.