దూరవిద్య అడ్మిషన్ల ఫీజు గడువు పొడిగింపు
ABN , First Publish Date - 2020-10-01T09:35:27+05:30 IST
కేయూ దూరవిద్య కేంద్రం అందిస్తున్న డిగ్రీ, పీజీ కోర్సుల అడ్మిషన్ల ఫీజులను ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఈనెల 12 వరకు
కేయూ క్యాంపస్, సెప్టెంబరు 30: కేయూ దూరవిద్య కేంద్రం అందిస్తున్న డిగ్రీ, పీజీ కోర్సుల అడ్మిషన్ల ఫీజులను ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఈనెల 12 వరకు చెల్లించుకునేందుకు గడువు పొడిగించినట్లు ఎస్డీఎల్సీఈ డైరెక్టర్ ప్రొఫెసర్ జి.వీరన్న ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ ద్వితీయ, తృతీయ సంవత్సరం. పీజీ ఫైనల్ ఇయర్ విద్యార్థులు ఆన్లైన్లో లేదా దూరవిద్య కేంద్రంలో నేరుగా ఫీజులు చెల్లించుకోవాలని సూచించారు.