అదరగొట్టిన ఐఓసీ

ABN , First Publish Date - 2020-10-31T06:53:29+05:30 IST

సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ) నికర లాభం ఏకంగా పదకొండు రెట్లు పెరిగి రూ.

అదరగొట్టిన ఐఓసీ

క్యూ2లో 11  రెట్లు పెరిగిన లాభం 

న్యూఢిల్లీ : సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ) నికర లాభం ఏకంగా పదకొండు రెట్లు పెరిగి రూ.6,237.31 కోట్లుగా నమోదైంది. రిఫైనింగ్‌ మార్జిన్లు పెరగటం, ఇన్వెంటరీ లాభాలు ఈ త్రైమాసికంలో కంపెనీకి ఎంతగానో కలిసివచ్చాయి. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ నికర లాభం రూ.563.42 కోట్లుగా ఉంది. మే, జూన్‌ నెలల్లో తక్కువ ధరకే కొనుగోలు చేసిన క్రూడాయిల్‌ను పెట్రోలియం ఉత్పత్తుల్లోకి మార్చటంతో దాదాపు రూ.7,400 కోట్లను కంపెనీ ఆర్జించింది.


సమీక్షా కాలంలో కంపెనీ మొత్తం ఆదాయం మాత్రం రూ.1.32 లక్షల కోట్ల నుంచి రూ.1.15 లక్షల కోట్లకు పడిపోయింది. కాగా ఇంధన విక్రయాలు జూన్‌ త్రైమాసికంతో పోల్చితే 16 శాతం పెరిగాయి. అయితే గత ఏడాది ఇదే త్రైమాసికంతో చూస్తే మాత్రం 12 శాతం తగ్గాయి. మరోవైపు ప్రస్తు త ఆర్థిక సంవత్సరంలో ప్రైవేట్‌ ప్లేస్‌మెంట్స్‌ లేదా డిబెంచర్ల జారీ ద్వారా రూ.20,000 కోట్లు సమీకరించేందుకు ఐఓసీ బోర్డు ఆమోదం తెలిపింది. 


Updated Date - 2020-10-31T06:53:29+05:30 IST