కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రైతులతో ఆడుకుంటున్నాయి: మధుయాష్కీ

ABN , First Publish Date - 2022-04-09T22:35:00+05:30 IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ రైతులతో ఆటలాడుకుంటున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ ఆరోపించారు.

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రైతులతో ఆడుకుంటున్నాయి: మధుయాష్కీ

హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ రైతులతో ఆటలాడుకుంటున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ ఆరోపించారు. తాము పండించిన ధన్యాన్ని కొనేవారు లేక, దిక్కుతోచని స్థితిలో రైతులుకొట్టు మిట్టాడుతున్నరని అన్నారు. కానీ కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వాలు రైతులను పట్టించుకోకుండా పోట్లాడుకుంటున్నాయని అన్నారు. ఏపీ, కర్ణాటకలో లేనిదాన్ని సమస్య తెలంగాణలోని ఎందుకు వచ్చిందని ఆయన ప్రశ్నించారు. మేమే ధాన్యం కొంటాం అన్న సీఎం కేసీఆర్ ఎందుకు కొనడం లేదు మధుయాష్కీ ప్రశ్నించారు. తెలంగాణ గవర్నర్ పై రాష్ట్ర ప్రభుత్వ వ్యాఖ్యలు సరికాదని మధుయాష్కీ పేర్కొన్నారు. 

Updated Date - 2022-04-09T22:35:00+05:30 IST