భద్రత కల్పించండి.. ఎస్పీని కలిసిన టీడీపీ మాజీ మంత్రి

ABN , First Publish Date - 2020-02-22T02:51:01+05:30 IST

గిరిజన ప్రాంత నేతలకు భద్రత కల్పించాలంటూ మాజీ మంత్రి కిడారి శ్రవణ్‌ ఎస్పీని కలిసి వినతిపత్రం ఇచ్చారు. తమ నాన్నకు భద్రత లేకపోవడం వల్ల....

భద్రత కల్పించండి.. ఎస్పీని కలిసిన టీడీపీ మాజీ మంత్రి

విశాఖ: గిరిజన ప్రాంత నేతలకు భద్రత కల్పించాలంటూ మాజీ మంత్రి కిడారి శ్రవణ్‌ కుమార్ ఎస్పీని కలిసి వినతి పత్రం ఇచ్చారు. తమ నాన్నకు భద్రత లేకపోవడం వల్ల మావోయిస్టుల చేతిలో హత్య చేయబడ్డారని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వం తనకు 18 మంది భద్రతా సిబ్బందిని కల్పించిందని, ఈ ప్రభుత్వం భద్రత పూర్తిగా తొలగించిందని శ్రవణ్ తెలిపారు. మావోయిస్టుల వల్ల ఎవరి ప్రాణం పోయినా దానికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలన్నారు. మావోయిస్టుల ముప్పు లేదని ప్రభుత్వం చేబుతోందని, అలాంటప్పుడు ఏజెన్సీ అంతటా గ్రేహౌండ్స్‌ బలగాలు ఎందుకు గాలిస్తున్నాయని కిడారి శ్రవణ్‌ ప్రశ్నించారు. 


Updated Date - 2020-02-22T02:51:01+05:30 IST