పసిడి రవాణాకూ ఈ-వే బిల్లు !

ABN , First Publish Date - 2022-06-24T06:51:39+05:30 IST

పసిడి రవాణాను మరింత కట్టుదిట్టం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా రూ.2 లక్షల కంటే ఎక్కువ విలువైన పసిడి, విలువైన లోహాలు, రాళ్ల అంతర్రాష్ట్ర రవాణాకు ఈ-వే బిల్లు తప్పనిసరి చేయాలని యోచిస్తోంది.

పసిడి రవాణాకూ ఈ-వే బిల్లు !

న్యూఢిల్లీ: పసిడి రవాణాను మరింత కట్టుదిట్టం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా రూ.2 లక్షల కంటే ఎక్కువ విలువైన పసిడి, విలువైన లోహాలు, రాళ్ల అంతర్రాష్ట్ర రవాణాకు ఈ-వే బిల్లు తప్పనిసరి చేయాలని యోచిస్తోంది. అలాగే రూ.20 కోట్లకు మించి వార్షిక టర్నోవర్‌ ఉండి పన్ను చెల్లింపుల పరిధిలో ఉన్న వ్యాపారులు, వ్యాపార సంస్థలు ఇతర వ్యాపారులు, వ్యా పార సంస్థలకు (బీ2బీ) సరఫరా చేసే పసిడి, విలువైన రాళ్ల రవాణా లావాదేవీలకు ఈ-ఇన్వాయిస్‌ను తప్పనిసరి చేసే విషయాన్నీ పరిశీలిస్తోంది.28-29 తేదీల్లో జరిగే జీఎస్‌టీమండలి సమావేశంలో వీటిపై చర్చించనున్నారు.

Updated Date - 2022-06-24T06:51:39+05:30 IST