ts news:టీఆర్ఎస్ హయాంలో దౌర్జన్యం పెరిగిపోతోంది: ఈటల

ABN , First Publish Date - 2022-09-24T00:37:22+05:30 IST

టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దౌర్జన్యం పెరిగిపోతోందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు.

ts news:టీఆర్ఎస్ హయాంలో దౌర్జన్యం పెరిగిపోతోంది: ఈటల

హైదరాబాద్: టీఆర్ఎస్ (trs govt) హయాంలో దౌర్జన్యం పెరిగిపోతోందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్( Etala Rajender) అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వృద్ధ దంపతులపై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.స్థానిక ఎస్ఐ భారత్ రెడ్డి(SI Bharat Reddy) ప్రోద్బలంతోనే ఈ దాడి జరిగిందన్నారు. చీమ చిటుక్కుమన్నా కనిపెడతామనే పోలీసులు దాడికి పాల్పడిన వారిని ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు. కొందరు పోలీసులు అధికార పార్టీ నాయకుల అడుగులకు మడుగులోత్తే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఎస్ఐ భారత్‌రెడ్డిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. పోలీస్ స్టేషన్‌లోనే యాదయ్య కుమారుడు రాఘవేందర్‌ను చంపుతానని బెదిరించడం చూస్తే పోలీసు వైఫల్యం ఏ మేరకు ఉందో అర్ధమవుతోందన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల భూములపై అధికార పార్టీ నాయకుల కన్నుపడిందని చెప్పారు. అధికార పార్టీ దౌర్జన్యాలకు, దుర్మార్గాలకు, ల్యాండ్ మాఫియాలకు నిలయంగా మారిందన్నారు.కేసీఆర్ పార్టీ దుర్మార్గాలను ప్రజలు నిశితంగా గమనిస్తూ ఉన్నారని... సమయం వచ్చినప్పుడు బొందపేట్టేందుకు  సిద్ధంగా ఉన్నారన్నారు.ఇక్కడున్న ఎస్పీ తక్షణమే దాడికి పాల్పడిన వారందరినీ అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-09-24T00:37:22+05:30 IST