గిరిజనులకు నిత్యావసరాలు పింపిణీ చేసిన సీతక్క

ABN , First Publish Date - 2020-04-09T18:41:16+05:30 IST

కరోనా ప్రభావం ఆదివాసీలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

గిరిజనులకు నిత్యావసరాలు పింపిణీ చేసిన సీతక్క

తడ్వాయి: కరోనా ప్రభావం ఆదివాసీలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. నిత్యావసర వస్తువులు అందక తీవ్ర ఇబ్బందు పడుతున్నారు. ఇక్కడి వాళ్లకు ఓటు హక్కు, రేషన్ కార్డులు లేవు. దీంతో స్థానిక ఎమ్మెల్యే సీతక్క తడ్వాయి మండలంలోని ఓ గిరిజన గూడెంలో నివసిస్తున్న గిరిజనులను పలుకరించి వారికి నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ ఇక్కడ గిరిజనులు చాలా ఇబ్బందులు పడుతున్నారని, దుర్భరంగా బతుకుతున్నారని తెలిపారు. శీతాకాలంలో వారికి దుప్పట్లు, బట్టలు పంపిణీ చేశానన్నారు. లాక్ డౌన్ సమయంలో వారు బయటకు వెళ్లి పనులు చేసుకునే అవకాశం లేదని.. అందుకే ఇవాళ వారికి నిత్యావసర వస్తులు పంపిణీ చేశానన్నారు. తాను ఇచ్చేది రెండు, మూడు రోజులకు సరిపోతుందని, దాతలు, స్వచ్చంధ సంస్థలు స్పందించి గిరిజనులను ఆదుకోవాలని ఎమ్మెల్యే సీతక్క ఏబీఎన్ ద్వారా కోరారు.

Updated Date - 2020-04-09T18:41:16+05:30 IST