సారీ.. సేవలందించలేం!
ABN , First Publish Date - 2020-02-20T09:21:41+05:30 IST
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈఎ్సఐ డిస్పెన్సరీలు మూతపడే పరిస్థితి నెలకొంది. ఇప్పటికే మందుల కొరతతో ఇబ్బందులు ఎదురవుతుండగా..
- ఈఎ్సఐ డిస్పెన్సరీల్లో బోర్డులు
హైదరాబాద్(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈఎ్సఐ డిస్పెన్సరీలు మూతపడే పరిస్థితి నెలకొంది. ఇప్పటికే మందుల కొరతతో ఇబ్బందులు ఎదురవుతుండగా.. తాజాగా వైద్యులు, సిబ్బంది డిప్యుటేషన్లను అధికారులు రద్దు చేయడంతో రోగులకు సేవలందించే వారు కరువయ్యారు. తగినంత మంది సిబ్బంది, మందులు లేకపోవడంతో సేవలు అందించలేక పోతున్నామంటూ మిర్యాలగూడ డిస్పెన్సరీలో ఏకంగా నోటీసు బోర్డు ఏర్పాటు చేశారు. ఇదొక్కటే కాదు హైదరాబాద్లోని చిక్కడపల్లి, తార్నాక, రెజిమెంటల్ బజార్, డబీర్పురా డిస్పెన్సరీల్లో ల్యాబ్లు, గోల్కొండ, చర్లపల్లి, మేడ్చల్లో ఫార్మసీలు మూతపడ్డాయి. డిప్యూటేషన్లు రద్దు చేయడంతో డిస్పెన్సరీల్లో గందరగోళం నెలకొందని, వాటిపై పునరాలోచించాలని సీపీఎం గ్రేటర్ కార్యదర్శి శ్రీనివాస్ డిమాండ్ చేశారు.