రెండు కోట్ల ఉద్యోగాలిస్తానని మోసం చేసిన మోదీని ఏ జైలులో పెట్టాలి

ABN , First Publish Date - 2022-01-29T00:25:00+05:30 IST

ఎన్నికల ప్రచారంలో భాగంగా నరేంద్ర మోదీ దేశ ప్రజలకు రెండు కోట్ల ఉద్యోగాలిస్తానని మోసం చేశారు

రెండు కోట్ల ఉద్యోగాలిస్తానని మోసం చేసిన మోదీని ఏ జైలులో పెట్టాలి

జనగామ: ఎన్నికల ప్రచారంలో భాగంగా నరేంద్ర మోదీ దేశ ప్రజలకు రెండు కోట్ల ఉద్యోగాలిస్తానని మోసం చేశారు. మరి ఆయనను ఏ జైలులో పెట్టాలని పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శుక్రవారం మీడియా సమావేశంలో ప్రశ్నించారు. ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, జనగామ జెడ్పీ చైర్మన్, జనగామ జిల్లా టిఆర్ఎస్ అధ్యక్షుడు పాగాల సంపత్ రెడ్డి, ఎమ్మెల్సీ బండా ప్రకాశ్, ఎమ్మెల్యే, వరంగల్ జిల్లా టిఆర్ఎస్ అధ్యక్షుడు ఆరూరి రమేష్ తో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. 


వరంగల్ లో మిర్చి రైతుల పరామర్శకు వెళ్లిన ఈటల రాజేందర్ రైతులకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.ఈటల బయ్యారం పర్యటనకు వస్తే స్థానికులు అడ్డుకున్నారు.బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఎందుకు ఇవ్వలేదు.రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏమైంది..?గిరిజన యూనివర్సిటీ ఏమైంది?అంటూ వారు ప్రశ్నల వర్షం కురిపించారు.ల్యాండ్ ఇచ్చినా పనులు ప్రారంభం కాలేదన్నబండి సంజయ్, కిషన్ రెడ్డి పిచ్చిమాటలు మానుకోవాలన్నారు.మేడారం జాతరకు జాతీయ హోదా ఇస్తామని కూడా ఇవ్వలేదన్నారు.


ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ మాట్టాడుతూ నాపై నమ్మకం ఉంచి హనుమకొండ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్ష పదని ఇచ్చిన కేసీఆర్ నమ్మకాన్ని నిలబెడతానని అన్నారు. కేసీఆర్ ఇజం ప్రజల్లోకి తీసుకెళ్తా నని అన్నారు. దేశం కేసీఆర్ వైపు చూస్తోందని దీన్ని చూసి ఓర్వలేకనే బీజేపీ నాయకులు ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. త్వరలోనే బీజేపీ బండారం బయటపెడతామన్నారు.వరంగల్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆరూరి రమేష్ మాట్లాడుతూ వరంగల్ జిల్లాలో టీఆర్ఎస్ మరింత బలోపేతం చేస్తానన్నారు. తనను ఎంపిక చేసిన కేసీఆర్, కేటీఆర్ నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని అన్నారు.  


Updated Date - 2022-01-29T00:25:00+05:30 IST