ప్రతిపక్షాల మాటలు నమ్మొద్దు: ఎర్రబెల్లి

ABN , First Publish Date - 2021-02-26T08:27:43+05:30 IST

ప్రతిపక్షాల మాటలను ఎవరూ నమ్మొద్దని, ఏదైనా చేయగలిగేది సీఎం కేసీఆర్‌ ఒక్కరేనని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు

ప్రతిపక్షాల మాటలు నమ్మొద్దు: ఎర్రబెల్లి

మహబూబాబాద్‌, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): ప్రతిపక్షాల మాటలను ఎవరూ నమ్మొద్దని, ఏదైనా చేయగలిగేది సీఎం కేసీఆర్‌ ఒక్కరేనని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మహబూబాబాద్‌ జిల్లా మరిపెడలో గురువారం నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహాక సమావేశంలో ఆయన మాట్లాడుతూ బడుగు, బలహీనవర్గాల కోసం సీఎం కేసీఆర్‌ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. 

Updated Date - 2021-02-26T08:27:43+05:30 IST