సత్వర న్యాయం అందేలా చూడండి: న్యాయశాఖ
ABN , First Publish Date - 2022-09-23T10:50:16+05:30 IST
సత్వర న్యాయం అందేలా చూడండి: న్యాయశాఖ
అమరావతి, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): న్యాయశాఖ ముఖ్యకార్యదర్శి, డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్(ఎ్ఫఏసీ) జి.సత్యప్రభాకరరావు రాష్ట్రంలోని పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో హైకోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వై.నాగిరెడ్డి, అదనపు పీపీ దుష్యంత్ రెడ్డి, అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ బి.రామకోటేశ్వరరావు, జాయింట్ డైరెక్టర్లు అజయ్ ప్రేమ్కుమార్, సుబ్బలక్ష్మమ్మ పాల్గొన్నారు.