England vs India: టాస్ గెలిచిన ఇంగ్లండ్

ABN , First Publish Date - 2021-09-02T20:56:07+05:30 IST

ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇండియా-ఇంగ్లండ్ మధ్య మరికాసేపట్లో ఇక్కడి కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో నాలుగో టెస్టు ప్రారంభం కాబోతోంది

England vs India: టాస్ గెలిచిన ఇంగ్లండ్

లండన్: ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇండియా-ఇంగ్లండ్ మధ్య మరికాసేపట్లో ఇక్కడి కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో నాలుగో టెస్టు ప్రారంభం కాబోతోంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ బౌలింగ్ ఎంచుకుంది. హెడింగ్లీ టెస్టులానే ఇంగ్లండ్ రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. జోస్ బట్లర్ స్థానంలో ఒల్లీ పోప్, శామ్ కరన్ స్థానంలో క్రిస్ వోక్స్ బరిలోకి దిగుతుండగా, ఇండియా కూడా రెండు మార్పులతో తుది జట్టును ప్రకటించింది. ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ స్థానంలో ఉమేశ్ యాదవ్, శార్దూల్ ఠాకూర్ తిరిగి జట్టులోకి వచ్చారు. కాగా, ఐదు టెస్టుల సిరీస్‌లో ఇండియా, ఇంగ్లండ్ జట్లు చెరో మ్యాచ్ గెలిచి సమ ఉజ్జీలుగా ఉన్నాయి.

Updated Date - 2021-09-02T20:56:07+05:30 IST