ఇంగ్లండ్‌ టూర్‌కు జులన్‌, కిరణ్‌

ABN , First Publish Date - 2022-08-20T10:47:16+05:30 IST

వచ్చే నెలలో ఇంగ్లండ్‌లో పర్యటించే భారత మహిళల క్రికెట్‌ జట్లను శుక్రవారం ప్రకటించారు.

ఇంగ్లండ్‌ టూర్‌కు జులన్‌, కిరణ్‌

వన్డే, టీ20 సిరీస్‌లకు భారత మహిళల జట్లు

న్యూఢిల్లీ: వచ్చే నెలలో ఇంగ్లండ్‌లో పర్యటించే భారత మహిళల క్రికెట్‌ జట్లను శుక్రవారం ప్రకటించారు. సెప్టెంబరు 10న ఆరంభమయ్యే ఈ టూర్‌లో హర్మన్‌ప్రీత్‌ సేన మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. వెటరన్‌ పేసర్‌ జులన్‌ గోస్వామి నాలుగు నెలల విరామం తర్వాత వన్డే జట్టులో చేరింది.


గత జూలైలో శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌కు ఆమె గాయంతో దూరమైంది. ఇక రెండు జట్లకు హర్మన్‌ ప్రీత్‌ కెప్టెన్‌గా, స్మృతి మంధాన వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. దేశవాళీల్లో విశేషంగా రాణించిన డాషింగ్‌ బ్యాటర్‌ కిరణ్‌ ప్రభు నవ్‌గిరే తొలిసారి టీ20ల్లో చోటు దక్కించుకుంది. అయితే యాస్తిక భాటియా, హర్లీన్‌ డియోల్‌లపై వేటు పడింది. కాగా, తెలుగమ్మాయి సబ్బినేని మేఘన రెండు జట్లలోనూ చోటు నిలబెట్టుకుంది. 


టీ20 జట్టు:

హర్మన్‌ప్రీత్‌ (కెప్టెన్‌), స్మృతి మంధాన, షఫాలీ, జెమీమా రోడ్రిగ్స్‌, మేఘన, దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్‌, స్నేహ్‌ రాణా, రేణుకా ఠాకూర్‌, మేఘనా సింగ్‌, రాధా యాదవ్‌, సబ్బినేని మేఘన, తానియా, రాజేశ్వరి, హేమలత, సిమ్రన్‌, రిచా ఘోష్‌, కిరణ్‌ నవ్‌గిరే. 


వన్డే జట్టు:

హర్మన్‌ప్రీత్‌ (కెప్టెన్‌), స్మృతి మంధాన, షఫాలీ, జెమీమా, సబ్బినేని మేఘన, దీప్తి శర్మ, తానియా, యాస్తిక, హర్లీన్‌, పూజా వస్త్రాకర్‌, స్నేహ్‌ రాణా, రేణుకా ఠాకూర్‌, మేఘనా సింగ్‌, రాజేశ్వరి, హేమలత, సిమ్రన్‌, జులన్‌ గోస్వామి.

Updated Date - 2022-08-20T10:47:16+05:30 IST