ఇంగ్లండ్ బోణీ
ABN , First Publish Date - 2022-09-21T09:34:06+05:30 IST
పాకిస్థాన్తో ఏడు టీ20ల సిరీస్లో ఇంగ్లండ్ శుభారంభం చేసింది.
కరాచీ: పాకిస్థాన్తో ఏడు టీ20ల సిరీస్లో ఇంగ్లండ్ శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన తొలి టీ20లో ఇంగ్లండ్ 6 వికెట్ల తేడాతో పాక్పై గెలిచింది. తొలుత పాక్ 20 ఓవర్లలో 158/7 స్కోరు చేసింది. ఓపెనర్ రిజ్వాన్ (68) అర్ధ శతకం సాధించాడు. ఛేదనలో ఇంగ్లండ్ 19.2 ఓవర్లలో 4 వికెట్లకు 160 పరుగులు చేసి గెలిచింది. హేల్స్ (53) హాఫ్ సెంచరీతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.