రాణించిన అక్షర్, అశ్విన్.. ఇంగ్లండ్ 205 ఆలౌట్
ABN , First Publish Date - 2021-03-04T21:26:47+05:30 IST
మొతేరా వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న నాల్గో టెస్టులో మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన రూట్ సేన 75.5 ఓవర్లలో 205 పరులకే ఆలౌట్ అయింది.
అహ్మదాబాద్: మొతేరా వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న నాల్గో టెస్టులో మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన రూట్ సేన 75.5 ఓవర్లలో 205 పరులకే ఆలౌట్ అయింది. ఆరంభం నుంచే భారత బౌలర్లు విజృంభించడంతో ఇంగ్లండ్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. ఇంగ్లండ్ బ్యాట్స్మెన్లలో బెన్ స్టోక్స్(55) ఒక్కడే అర్థశతకంతో రాణించాడు. డాన్ లారెన్స్(46), ఓల్లీ పొప్(29), జానీ బెయిర్స్టో(28) పరుగులతో పర్వాలేదనిపించారు. ఓపెనర్లు క్రాలే(09), సిబ్లీ(02)తో పాటు సారథి జో రూట్(05) కూడా మరోసారి నిరాశపరిచాడు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ మళ్లీ ఇంగ్లీష్ బ్యాట్స్మెన్లను ముప్పుతిప్పలు పెట్టాడు. నాలుగు వికెట్లు తీసి ఇంగ్లండ్ను కోలుకోని దెబ్బ తీశాడు. అలాగే మరో స్పిన్నర్ అశ్విన్ కూడా 3 వికెట్లు పడగొట్టగా.. మహమ్మద్ సిరాజ్ రెండు, వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్ తీశారు.