England U19 vs India U19: కుదురుకున్న ఇంగ్లండ్.. సెంచరీ దిశగా జేమ్స్ రెవ్

ABN , First Publish Date - 2022-02-06T03:00:26+05:30 IST

అండర్-19 ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌తో జరుగుతున్న ఫైనల్‌లో తొలుత తడబడిన ఇంగ్లండ్ ఇప్పుడు కాస్తంత

England U19 vs India U19: కుదురుకున్న ఇంగ్లండ్.. సెంచరీ దిశగా జేమ్స్ రెవ్

అంటిగ్వా: అండర్-19 ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌తో జరుగుతున్న ఫైనల్‌లో తొలుత తడబడిన ఇంగ్లండ్ ఇప్పుడు కాస్తంత కుదురుకుంది. 91 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిన వేళ జట్టు భారాన్ని తనపై వేసుకున్న జేమ్స్ రెవ్ క్రీజులో అద్భుతంగా కుదురుకున్నాడు. సహచరులు ఒక్కొక్కరే వెనుదిరుగుతున్నా సడలని విశ్వాసంతో క్రీజులో పాతుకుపోయిన జేమ్స్ జట్టును మళ్లీ పటిష్ఠ స్థితికి తీసుకొచ్చాడు. 


తొలుత తమ పదునైన బంతులతో ఇంగ్లండ్ బ్యాటర్లను బెంబేలెత్తించిన భారత బౌలర్లు ఆ జట్టును ఒత్తిడిలోకి నెట్టేశారు. రాజ్ బవా 4, రవికుమార్ 2 వికెట్లతో విజృంభించారు. అయితే, అప్పటికే క్రీజులో కుదురుకుపోయిన జేమ్స్ రెవ్‌కు జేమ్స్ సేల్స్ చక్కని సహకారం అందిస్తూ మరో వికెట్ పోకుండా జాగ్రత్త పడ్డాడు.


ఇద్దరూ కలిసి బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరు బోర్డుపై పరుగులు పెంచుకుంటూ పోయారు. ఈ క్రమంలో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న జేమ్స్ రెవ్.. సెంచరీ దిశగా సాగుతున్నాడు. ప్రస్తుతం 40 ఓవర్లు ముగిశాయి. ఇంగ్లండ్ 7 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. జేమ్స్ రెవ్ 84, జేమ్స్ సేల్స్ 26 పరుగులతో క్రీజులో ఉన్నారు.

Updated Date - 2022-02-06T03:00:26+05:30 IST