కట్టబోయే ఇళ్లలో ఇంధన పొదుపు
ABN , First Publish Date - 2020-08-10T10:06:24+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం నిర్మించనున్న ఇళ్లలో ఇండో స్విస్ ఇంధన పొదుపు సాంకేతికతను అమలు చేయాలని గృహ నిర్మాణ శాఖ ప్రతిపాదించింది. దీనివల్ల
అమరావతి, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం నిర్మించనున్న ఇళ్లలో ఇండో స్విస్ ఇంధన పొదుపు సాంకేతికతను అమలు చేయాలని గృహ నిర్మాణ శాఖ ప్రతిపాదించింది. దీనివల్ల 20శాతం విద్యుత్ ఆదా అయ్యే అవకాశం ఉందని ఆ శాఖ కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. ఈ ఇళ్లలో ఇంధన పొదుపు కోసం ఇప్పటికే ఇండో స్విస్ బిల్డింగ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ప్రాజెక్టుతో ఒక అవగాహనకు వచ్చినట్లు ఆయన వెల్లడించారు.