వీక్లీ ఓపెన్ హౌస్ని రీషెడ్యూల్ చేసిన భారత ఎంబసీ
ABN , First Publish Date - 2020-09-15T13:57:06+05:30 IST
కువైట్లోని భారత ఎంబసీ వీక్లీ ఓపెన్ హౌస్ని తాత్కాలికంగా రీషెడ్యూల్ చేసింది.
కువైట్ సిటీ: కువైట్లోని భారత ఎంబసీ వీక్లీ ఓపెన్ హౌస్ని తాత్కాలికంగా రీషెడ్యూల్ చేసింది. ప్రతి బుధవారం రాయబార కార్యాలయంలోని ఆడిటోరియంలో ఇండియన్ ఎంబసీ ప్రవాసుల కోసం ఈ ఓపెన్ హౌస్ మీటింగ్స్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే, మహమ్మారి కరోనా నేపథ్యంలో దీనిని రీషెడ్యూల్ చేస్తున్నట్లు ప్రకటించింది. తక్షణమే ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని, తదుపరి ఓపెన్ హౌస్ మీటింగ్కు సంబంధించిన షెడ్యూల్ను త్వరలోనే ప్రకటిస్తామని ఎంబసీ అధికారులు పేర్కొన్నారు.
కాగా, ఎంబసీ అధికారులు మాత్రం యథాతథంగా చిన్న చిన్న గ్రూపులుగా మీటింగ్ నిర్వహిస్తుంటారని, వీటికి హాజరయ్యేందుకు ముందస్తుగా అపాయింట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుందని రాయబార కార్యాలయం సూచించింది. కమ్యూనిటీ మెంబర్స్ అపాయింట్మెంట్ కోసం community.kuwait@mea.gov.inకు మెయిల్ చేయాలని కోరింది. ఇక ఇటీవల నిర్వహించిన ఓపెన్ హౌస్ మీటింగ్స్లో దౌత్య కార్యాలయం... కమ్యూనిటీ వెల్ఫేర్ ఫండ్, ఇంజనీర్స్ అక్రిడిటేషన్ సమస్యలపై చర్చించి వాటి పరిష్కారం దిశగా చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే.