Music Fest లో తొక్కిసలాట 8 మంది మృతి.. America లో..

ABN , First Publish Date - 2021-11-07T12:56:12+05:30 IST

అమెరికాలోని హ్యూస్టన్‌లో విషాదం చోటుచేసుకుంది. వారాంతపు మ్యూజిక్‌ ఫెస్టివల్‌లో తొక్కిసలాట జరగడంతో 8 మంది దుర్మరణంపాలయ్యారు.

Music Fest లో తొక్కిసలాట 8 మంది మృతి.. America లో..

హ్యూస్టన్‌లో 8 మంది మృతి

వందలాది మందికి గాయాలు

హ్యూస్టన్‌, నవంబరు 6: అమెరికాలోని హ్యూస్టన్‌లో విషాదం చోటుచేసుకుంది. వారాంతపు మ్యూజిక్‌ ఫెస్టివల్‌లో తొక్కిసలాట జరగడంతో 8 మంది దుర్మరణంపాలయ్యారు. వందలాది మంది గాయపడ్డారు. టెక్స్‌సలోని హ్యూస్టన్‌లో శుక్రవారం రాత్రి ప్రఖ్యాత ర్యాపర్‌ ట్రావిస్‌ స్కాట్‌ నిర్వహించిన మ్యూజిక్‌ ఫెస్టివల్‌కు దాదాపు 50 వేల మందికి పైగా హాజరైనట్లు అధికారులు తెలిపారు. రాత్రి 9 గంటల సమయంలో ప్రేక్షకులంతా సభా వేదిక ముందుకు దూసుకురావడంతో తొక్కిసలాట జరిగిందని వివరించారు. ఘటనలో అపస్మారక స్థితికి చేరిన 17 మందిని స్థానిక ఆస్పత్రులకు తరలించామని వెల్లడించారు. 8మంది కన్నుమూయగా.. 300 మందికి పైగా గాయాలయ్యాయి. కార్యక్రమాన్ని వెంటనే నిలిపివేసినట్లు హ్యూస్టన్‌ పోలీసులు చెప్పారు. ఈ షోకు సంబంధించిన టికెట్లు మేలో అమ్మకానికి పెట్టగా కేవలం గంటలోనే అయిపోవడం గమనార్హం.

Updated Date - 2021-11-07T12:56:12+05:30 IST