టీడీపీ మద్దతుదారులపై వైసీపీ కార్యకర్తల దాడి

ABN , First Publish Date - 2021-03-04T20:20:34+05:30 IST

పంచాయతీ ఎన్నికలు ముగిసినా వైసీపీ శ్రేణుల్లో అక్కసం, ఆక్రోశం చల్లారడంలేదు.

టీడీపీ మద్దతుదారులపై వైసీపీ కార్యకర్తల దాడి

తూ.గో.జిల్లా: పంచాయతీ ఎన్నికలు ముగిసినా వైసీపీ శ్రేణుల్లో అక్కసం, ఆక్రోశం చల్లారడంలేదు. టీడీపీ సానుభూతిపరులపై దాడులు చేస్తూ భయోత్సాతం సృష్టిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా, ఎటపాక మండలం రాంగోపాలపురంలో టీడీపీ మద్దతుదారులపై వైసీపీ కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. కత్తులు, గొడ్డళ్లతో ఇంటిపై దాడి చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. దాడి ఘటనపై ఎటపాక పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Updated Date - 2021-03-04T20:20:34+05:30 IST