దుర్గా నవరాత్రులు
ABN , First Publish Date - 2021-10-09T06:27:24+05:30 IST
ఆశ్వయుజ శుద్ధ తదియ, శనివారం శరన్నవరాత్రి ఉత్సవాలలో మూడో రోజున శ్రీ గాయత్రీదేవి అలంకారంలో బెజవాడ శ్రీ కనకదుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తారు.
నేటి అలంకరణ
09- 10- 2021
శ్రీ గాయత్రీదేవి
ఆశ్వయుజ శుద్ధ తదియ, శనివారం శరన్నవరాత్రి ఉత్సవాలలో మూడో రోజున శ్రీ గాయత్రీదేవి అలంకారంలో బెజవాడ శ్రీ కనకదుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తారు. సమస్త దేవతా మంత్రాలకూ గాయత్రీ మంత్రంతో అనుబంధం ఉంది. అందుకే ఆయా దేవతల మూల మంత్రాలతో గాయత్రిని చేర్చి ‘రుద్రగాయత్రి’, ‘లక్ష్మీగాయత్రి’, ‘విష్ణుగాయత్రి’ అని గాయత్రీ మంత్రాన్ని కలిపి చెబుతారు. గాయత్రీ మంత్రంతో సంప్రోక్షణ చేసిన తర్వాతే ఆయా దేవతలకు నివేదన చేస్తారు. సకల మంత్రాలకి మూలమైన శక్తిగా, వేదమాతగా ప్రసిద్ధి పొందిన గాయత్రీదేవి ముక్తా, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలతో ప్రకాశిస్తూ, పంచముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన అధిష్ఠానదేవత. ఈ తల్లి శిరస్సుపై బ్రహ్మ, హృదయ స్థానంలో విష్ణువు, శిఖలో రుద్రుడు నివసిస్తారు. ఈ విధంగా త్రిమూర్త్యాంశంగా గాయత్రీదేవి వెలుగొందుతున్నది. గాయత్రీ మంత్రానికి అధిష్టాన దేవత సూర్యభగవానుడు. గాయత్రీ అమ్మవారిని దర్శించుకోవడం వల్ల సూర్యుడి అనుగ్రహంతో ఆరోగ్యం లభిస్తుందని నమ్మిక.
నైవేద్యం: అల్లం గారెలు, ఐదు రకాల పిండివంటలు
అలంకరించే చీర రంగు: తెలుపు
పారాయణ: చెయ్యాల్సింది: గాయత్రీ మంత్రం