రూ.లక్ష విలువైన నకిలీ శానిటైజర్ల పట్టివేత

ABN , First Publish Date - 2021-05-15T06:14:56+05:30 IST

రూ.లక్ష విలువైన నకిలీ శానిటైజర్ల పట్టివేత

రూ.లక్ష విలువైన నకిలీ శానిటైజర్ల పట్టివేత
నకిలీ శానిటైజర్లు పట్టుకున్న టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు

వరంగల్‌ అర్బన్‌ క్రైం, మే 14 : వరంగల్‌ జేపీఎన్‌ రోడ్డు, జెమినీ టాకీస్‌ రోడ్డులోని పలు షాపులలో రూ.లక్ష విలువైన నకిలీ శానిటైజర్లను  వరంగల్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు.  టాస్క్‌ఫోర్స్‌ సీఐ శ్రీనివాస్‌ జీ తెలిపిన వివరాల ప్రకారం.. సీపీ ఆదేశాల మేరకు వరంగల్‌ జెమిని ఽథియేటర్‌ రోడ్డు మార్గంలో కొన్ని షాపులలో నకిలీ శానిటైజర్లు అమ్మకాలు జరుపుతున్నట్టు సమాచారం అందింది.  శుక్రవారం మట్టెవాడ పోలీసులతో కలిసి రోల్ల శ్రీనివాస్‌, పరిమి ప్రసాద్‌, యంసాని విశ్వేశ్వర్‌, పెద్ది ప్రేమ్‌కుమార్‌, చిమ్మని శివకుమార్‌ల షాపులపై దాడులు చేశాం. వివిధ బ్రాండ్లు అతికించి ఉన్న నకిలీ శానిటైజర్లు స్వాధీనం చేసుకున్నామన్నారు.  కొందరు వ్యక్తులు హైదరాబాద్‌ నుంచి పెద్దఎత్తున శానిటైజర్లు కొనుగోలు చేసి చిన్నచిన్న బాటిళ్లలో పోసి కల్తీ చేసి అమ్ముతున్నారని అన్నారు.  సుమారు రూ.  లక్ష విలువైన 452 లీటర్ల నకిలీ శానిటైజర్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ దాడులలో మట్టెవాడ పోలీసులతో పాటు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-15T06:14:56+05:30 IST