నగ్నంగా ఫోజులిచ్చిన మహిళలు.. సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో..

ABN , First Publish Date - 2021-04-06T10:18:11+05:30 IST

మహిళలు నగ్నంగా ఫోజులిచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దీని వెనుక ఉన్న గుంపును దుబాయి

నగ్నంగా ఫోజులిచ్చిన మహిళలు.. సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో..

దుబాయి: మహిళలు నగ్నంగా ఫోజులిచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దీని వెనుక ఉన్న గుంపును దుబాయి పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. చాలా మంది మహిళలు నగ్నంగా పట్టపగలు బాల్కనీలో నిల్చుని ఫొటోలకు ఫోజులిచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు శనివారం నుంచి సోషల్ మీడియాలో వైరల్ అయిపోయాయి. దీంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగి దీని వెనుక ఉన్న వారందరిని అరెస్ట్ చేశారు. పబ్లిసిటీ కోసమే ఈ పని చేసినట్టు నిందితులు పోలీసులతో చెప్పినట్టు తెలుస్తోంది. చట్టానికి వ్యతిరేకంగా ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడినందుకు నిందితులకు ఆరు నెలల జైలుశిక్షతో పాటు 5 వేల దిర్హామ్‌(రూ. 99,716)ల జరిమానా పడే అవకాశముంది.

Updated Date - 2021-04-06T10:18:11+05:30 IST