మందడంలో డ్రోన్ వినియోగంపై డీఎస్పీ ఏమన్నారంటే..
ABN , First Publish Date - 2020-02-21T18:15:17+05:30 IST
మందడంలో డ్రోన్ వినియోగంపై డీఎస్పీ శ్రీనివాస్రెడ్డి వివరణ ఇచ్చారు. తన ఆదేశాలతోనే కానిస్టేబుల్ డ్రోన్తో చిత్రీకరించాడని తెలిపారు
అమరావతి: మందడంలో డ్రోన్ వినియోగంపై డీఎస్పీ శ్రీనివాస్రెడ్డి వివరణ ఇచ్చారు. తన ఆదేశాలతోనే కానిస్టేబుల్ డ్రోన్తో చిత్రీకరించాడని తెలిపారు. పైకప్పు లేని బాత్రూమ్లపై డ్రోన్ వీడియో తీశారనేది అవాస్తవమని కొట్టిపారేశారు. కొంతమంది ఉద్దేశపూర్వకంగానే పోలీసులతో దురుసుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
‘‘నేను బూటుకాలితో తన్నానని వార్తలు రాశారు.. నేను ఎవరినీ తన్నలేదు.. నా దగ్గర పూర్తి ఆధారాలున్నాయి. జేఏసీ కన్వీనర్ శ్రీనివాస్ను కులం పేరుతో ఎవరూ దూషించలేదు’’. అని వివరణ ఇచ్చారు. ఇక డ్రోన్ చిత్రీకరణపై మహిళల ఫిర్యాదుతో.. డీఎస్పీ శ్రీనివాస్రెడ్డి, సీఐ శరత్బాబుపై తుళ్లూరు పీఎస్లో కేసు నమోదైంది. అలాగే ఎమ్మెల్యే రోజాను అడ్డుకున్న ఘటనలో కూడా ఆందోళనకారులపై పోలీసులు కేసు నమోదు చేశారు.