కాంగ్రెస్లో డీఎస్ చేరిక మళ్లీ వాయిదా
ABN , First Publish Date - 2022-01-23T21:43:24+05:30 IST
రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్ కాంగ్రెస్లో చేరిక మళ్లీ వాయిదా పడింది. వాస్తవానికి ఈ నెల 24న డీఎస్ కాంగ్రెస్లో చేరాలని ముహుర్తం పెట్టుకున్నారు.
హైదరాబాద్: రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్ కాంగ్రెస్లో చేరిక మళ్లీ వాయిదా పడింది. వాస్తవానికి ఈ నెల 24న డీఎస్ కాంగ్రెస్లో చేరాలని ముహుర్తం పెట్టుకున్నారు. అయితే కరోనా పరిస్థితుల కారణంగా రేపటి జాయినింగ్ వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. పార్లమెంట్ సమావేశాల సమయంలో డీఎస్ కాంగ్రెస్లో చేరే అవకాశం ఉందని చెబుతున్నారు. గత కొంతకాలంగా శ్రీనివాస్, టీఆర్ఎస్లో ఇమడలేకపోతున్నారనే ప్రచారం జరుగుతోంది. రాజకీయంగా డీఎస్ ఎదుగుదలంతా కాంగ్రెస్ పార్టీలోనే జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి.. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన అధికార పార్టీలో చేరారు. రాజ్యసభ సభ్యుడు కూడా అయ్యారు. అయితే కొంత కాలానికే సీఎం కేసీఆర్కు, ఆయనకు మధ్య దూరం పెరిగిపోయింది. దీంతో తిరిగి కాంగ్రెస్లో చేరాలని డీఎస్ నిర్ణయం తీసుకున్నారు.