బంజారాహిల్స్లో తాగుబోతుల వీరంగం
ABN , First Publish Date - 2021-12-22T02:52:05+05:30 IST
నగరంలోని బంజారాహిల్స్లో మద్యం మత్తులో యువకులు
హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్లో మద్యం మత్తులో యువకులు వీరంగం సృష్టించారు. కారులో వచ్చి టూ వీలర్ను ఢీ కొట్టారు. అనంతరం అక్కడి నుంచి పారిపోవడానికి యువకులు యత్నించారు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. బ్రీత్ అనలైజార్ టెస్ట్ చేయడానికి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు యువకులను పోలీసులు తరలించారు. మద్యం తాగిన యువకులను కృష్ణానగర్కు చెందిన సాయి, వినయ్, పౌల్గా పోలీసులు గుర్తించారు. యువకులు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు.