విషెస్‌ పేరుతో డ్రగ్స్‌

ABN , First Publish Date - 2021-10-28T08:06:26+05:30 IST

విషెస్‌ పేరుతో డ్రగ్స్‌

విషెస్‌ పేరుతో డ్రగ్స్‌

జన్మదిన, వివాహ శుభాకాంక్షల పేరిట పార్శిళ్లలో రవాణా

విదేశాల నుంచి ఏపీకి మాదకద్రవ్యాలు.. చెన్నైలో పట్టివేత

కొబ్బరికాయల మాటున 2 వేల కేజీల గంజాయి

తూర్పు గోదావరిలో రూ.2 కోట్ల సరుకు స్వాధీనం


చెన్నై, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): విదేశాల నుంచి ఏపీకి రవాణా చేస్తున్న మాదక ద్రవ్యాలను చెన్నైలో పట్టుకున్నారు. నెదర్లాండ్స్‌, అమెరికాల నుంచి ఏపీకి చెందిన రెండు చిరునామాల పేరుతో వచ్చిన మాదకద్రవ్యాలను చెన్నై విమానాశ్ర యం కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నెదర్లాం డ్స్‌ నుంచి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ వచ్చిన ఒక పార్శిల్‌లో అత్యంత ఖరీదైన 10 మాదకద్రవ్యాల మాత్రలు, 8 గ్రాముల పొడి, అమెరికా నుంచి వివాహ మహోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ వచ్చిన పార్శిల్‌లో 132 గ్రాముల మత్తు పదార్థం లభ్యమైంది. అధికారులు వాటి చిరునామాదారుల కోసం దర్యాప్తు చేస్తున్నారు. అదేవిధంగా ఆ పార్శిళ్లు పంపిన వారి కోసం ఆరా తీస్తున్నారు. కాగా ఏపీ చిరునామాలతో పాటు చెన్నైకి కూడా మరో 2 పార్శిళ్లలో డ్రగ్స్‌ వచ్చాయి.    

Updated Date - 2021-10-28T08:06:26+05:30 IST