డ్రగ్స్ కేసులో ముగిసిన చార్మీ విచారణ... 6న హాజరుకావాలని రకుల్‌కు నోటీసులు

ABN , First Publish Date - 2021-09-03T00:51:33+05:30 IST

డ్రగ్స్ కేసులో ముగిసిన చార్మీ విచారణ... 6న హాజరుకావాలని రకుల్‌కు నోటీసులు

డ్రగ్స్ కేసులో ముగిసిన చార్మీ విచారణ... 6న హాజరుకావాలని రకుల్‌కు నోటీసులు

హైదరాబాద్‌: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ అధికారులు దూకుడు పెంచారు. ఈ కేసులో హీరోయిన్ చార్మీని కూడా విచారించారు. గురువారం ఉదయం నుంచి ఈడీ కార్యాలయంలో ఆమెను ప్రశ్నించారు. దాదాపు 8 గంటల పాటు విచారణ జరిపారు. బ్యాంక్ లావాదేవీలు, కెల్విన్‌తో సంబంధాలపై ఆరా తీశారు. చార్మీ బ్యాంక్ స్టేట్మెంట్‌ల ఆధారంగా ఈడీ అధికారులు విచారణ కొనసాగించారు. 


ఇక ఇదే కేసులో శుక్రవారం (రేపు) విచారణకు మరో నటి రకుల్ ప్రీత్‌సింగ్ హాజరుకానున్నారు. ఈనెల 6న విచారణకు హాజరుకావాలని ఇప్పటికే రకుల్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. అయితే ఈ నెల 6న విచారణకు హాజరుకాలేనని, మరికొంత గడువు ఇవ్వాలని ఈడీ అధికారులను రకుల్ కోరారు. సోమవారం కంటే ముందే విచారణకు హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రకుల్ విజ్ఞప్తి మేరకు శుక్రవారం విచారణకు హాజరుకావాలని ఈడీ నోటీసులు జారీ చేసింది. 




Updated Date - 2021-09-03T00:51:33+05:30 IST