సాయుధ రంగంలో ప్రైవేటు సంస్థల కృషి అభినందనీయం
ABN , First Publish Date - 2020-10-18T10:04:52+05:30 IST
దేశ సాయుధ రంగ స్వావలంబనకు ఆధునిక టెక్నాలజీతో పరిష్కారాలు అందించేలా ప్రైవేటు రంగం తోడ్పాటు అందించడం అభినందనీయమని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ ..
డీఆర్డీఓ చైర్మన్ సతీశ్ రెడ్డి
మహేశ్వరం, అక్టోబరు 17: దేశ సాయుధ రంగ స్వావలంబనకు ఆధునిక టెక్నాలజీతో పరిష్కారాలు అందించేలా ప్రైవేటు రంగం తోడ్పాటు అందించడం అభినందనీయమని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) చైర్మన్ డాక్టర్ సతీశ్ రెడ్డి అన్నారు. శనివారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిరాల పరిధి హార్డ్వేర్ పార్కులో రూ.వంద కోట్లతో చేపట్టిన డిఫెన్స్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ సంస్థను మేనేజింగ్ డైరెక్టర్ వెంకటరాజు, రాష్ట్ర పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో రక్షణ, సాయుధ బలగాలకు అవసరమయ్యే ఆధునిక సదుపాయాలు కోసం ఐఐఆర్ సీకర్లను తీర్చడానికి వెమ్ టెక్నాలజీ ముందుకు రావడం హర్షణీయం అన్నారు. ఆధునిక పరికరాలు, విడిభాగాల తయారీ కేంద్రాలు నెలకొల్పేందుకు మరింతమంది ముందుకు రావాలని ఆయన కోరారు.