ధవళేశ్వరం బ్యారేజీ వద్ద పెరుగుతున్న గోదావరి ప్రవాహం
ABN , First Publish Date - 2020-08-08T15:54:59+05:30 IST
ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి వరద ప్రవాహం స్వల్పంగా పెరుగుతోంది.
రాజమండ్రి: ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి వరద ప్రవాహం స్వల్పంగా పెరుగుతోంది. ప్రస్తుతం గోదావరి నీటి మట్టం 10.70 అడుగులకు పెరిగింది. దాదాపు లక్షా ఎనిమిది వేల క్యూసెక్కుల నీటిని జలవనరుల శాఖ అధికారులు సముద్రం లోకి విడుదల చేస్తున్నారు. ఉభయగోదావరి జిల్లాల్లో 8,200 క్యూసెక్కుల సాగునీటిని విడుదల చేశారు.