ఏవి చెయ్యాలి? వేటిని వదలాలి?

ABN , First Publish Date - 2020-11-06T05:30:00+05:30 IST

‘ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా, నీతిని విడిచిపెట్టకుండా, దైవాన్ని మరువకుండా, నిజాయతీగా జీవితాన్ని గడపడమే మానవ జన్మ పరమార్థం’ అని అన్ని ధర్మాలూ చెబుతాయి...

ఏవి చెయ్యాలి? వేటిని వదలాలి?

‘ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా, నీతిని విడిచిపెట్టకుండా, దైవాన్ని మరువకుండా, నిజాయతీగా జీవితాన్ని గడపడమే మానవ జన్మ పరమార్థం’ అని అన్ని ధర్మాలూ చెబుతాయి. అలాంటి జీవించినవారు సంతోషంగా ఉంటారు. మనుషులు ఏవి పాటించాలో, వేటిని విడిచిపెట్టాలో ఇస్లాం గ్రంథాలు మార్గనిర్దేశం చేశాయి. 


  1. రాత్రి సమయాల్లో లేచి ఆరాధన చేయడం, చేసిన పాపాలకు పశ్చాత్తాపం చెందడం, అధికంగా దానం చేస్తూ ఉండడం, దైవ నామస్మరణలో గడపడం... వీటివల్ల మనిషి సంతోషంగా ఉంటాడు. అతనికి దైవానుగ్రహం లభిస్తుంది. 
  2. అబద్ధాలు చెప్పేవారికీ, వడ్డీ మీద బతికేవారికీ, ఇతరులను గౌరవించనివారికీ, చెడ్డ విషయాల కోసం పట్టుపట్టేవారికీ ముఖ వర్చస్సు తగ్గిపోతుంది. సమాజంలో గౌరవం ఉండదు. 
  3. అతిగా మాట్లాడే వారూ, ఎక్కువగా నిద్రపోయేవారూ, మితిమీరి తినేవారూ, ఎక్కువమందిని కలుస్తూ ఉండేవారూ ఆందోళనకూ, అనారోగ్యానికీ గురవుతారు. 
  4. ఆందోళన, క్రుంగుబాటు, ఆకలి, ఆలస్యంగా నిద్రపోవడం... వీటివల్ల మనుషులు బలహీనులైపోతారు.
  5. నమాజ్‌ చేయనివారికీ, చేసినా క్రమం తప్పకుండా చెయ్యని వారికీ, అలసత్వంతో ఉండేవారికీ, ఇతరులను మోసగించేవారికీ దైవానుగ్రహం ఉండదు.

అందుకే సదా దైవచింతనలో ఉండాలి. ఇతరులకు సాయం చేస్తూ ఉండాలి. చెడ్డ విషయాలకూ, దురలవాట్లకూ, బద్ధకానికీ దూరంగా ఉండాలి. వీటిని పాటించేవారు లోకానికి ఆదర్శంగా ఉంటారు. దైవానికి ప్రీతిపాత్రులవుతారు.


- మహమ్మద్‌ వహీదుద్దీన్‌


Updated Date - 2020-11-06T05:30:00+05:30 IST