ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.4.20 కోట్ల విరాళం
ABN , First Publish Date - 2021-09-17T08:39:07+05:30 IST
టీటీడీ ఆధ్వ ర్యంలోని ఎస్వీబీసీ ట్రస్టుకు గురువారం రూ.4.20 కోట్లు విరాళంగా అందాయి.
తిరుమల, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): టీటీడీ ఆధ్వ ర్యంలోని ఎస్వీబీసీ ట్రస్టుకు గురువారం రూ.4.20 కోట్లు విరాళంగా అందాయి. అమెరికాకు చెందిన రవి ఐకా తరఫున ఆయన ప్రతినిధి విజయవాడకు చెందిన రామకృష్ణ ప్రసాద్ ఈ విరాళం చెక్కును టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డికి గురువారం అందజేశారు. ఈ నిధులతో ఎస్వీబీసీ చానల్కు అవసరమైన సాంకేతిక పరికరాలు కొనుగోలు చేస్తామని ధర్మారెడ్డి తెలిపారు.