సీఎం సహాయ నిధికి త్రిపుర ప్రణాళికా సంఘం సభ్యుడి విరాళం
ABN , First Publish Date - 2020-06-05T00:00:43+05:30 IST
కరోనా వ్యాప్తి నివారణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి సంఘీభావంగా త్రిపుర రాష్ట్ర ప్రణాళికా సంఘం సభ్యుడు మాటూరు సురేందర్రెడ్డి 25లక్షల విరాళం ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించారు.
హైదరాబాద్: కరోనా వ్యాప్తి నివారణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి సంఘీభావంగా త్రిపుర రాష్ట్ర ప్రణాళికా సంఘం సభ్యుడు మాటూరు సురేందర్రెడ్డి 25లక్షల విరాళం ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు నాయకత్వంలో వైరస్ వ్యాప్తి నివారణకు ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తున్నదని ఆయన ప్రశంసించారు. వినూత్న గ్రాండ్ ప్రాజెక్ట్స్ ఛైర్మన్కూడా అయిన సురేందర్రెడ్డి హైదరాబాద్ నివాసి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు త్రిపుర రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఆయన 25లక్షల విరాళం అందించారు.