డాలర్‌ శేషాద్రికి రేపు తిరుపతిలో అంత్యక్రియలు

ABN , First Publish Date - 2021-11-30T02:38:18+05:30 IST

డాలర్‌ శేషాద్రి కి నేడు తిరుపతిలో అంత్యక్రియలు జరగనున్నాయి. వైజాగ్‌ నుంచి ఆయన పార్థివదేహం సోమవారం అర్థరాత్రి తర్వాత తిరుపతికి చేరుకోనుంది.

డాలర్‌ శేషాద్రికి రేపు తిరుపతిలో అంత్యక్రియలు

తిరుపతి: డాలర్‌ శేషాద్రి కి నేడు తిరుపతిలో అంత్యక్రియలు జరగనున్నాయి. వైజాగ్‌ నుంచి ఆయన పార్థివదేహం సోమవారం అర్థరాత్రి తర్వాత తిరుపతికి చేరుకోనుంది. మంగళవారం ఉదయం ప్రజల సందర్శనార్థం తిరుపతిలోని సిరిగిరి అపార్ట్‌మెంట్‌లో ఉంచేలా ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 2-3గంటల మధ్య తిరుపతి గోవిందధామంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. సుప్రీంకోర్టుప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ డాలర్‌ శేషాద్రికి నివాళులర్పించేందుకు తిరుపతికి రానున్నారు. శేషాద్రి నివాసానికి చేరుకుని ఆయన పార్థివదేహానికి నివాళులర్పించి, మధ్యాహ్నం 2గంటలకు తిరిగి ఢిల్లీకి వెళ్లనున్నారు.

Updated Date - 2021-11-30T02:38:18+05:30 IST