ప్రతీ ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాలి
ABN , First Publish Date - 2021-03-05T05:26:30+05:30 IST
ప్రతీ ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాలి
కమలాపూర్, మార్చి 4 : కొవిడ్ వ్యాక్సిన్ను ప్రతీ ఒక్కరు తీసుకోవాలని డీఎంహెచ్వో లలితాదేవి అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ రాణి, డాక్టర్ హర్షిణిప్రియ, డాక్టర్ స్పప్న, హెచ్ఈవో రమేష్, వైద్య సిబ్బంది, ఆశలు తదితరులు పాల్గొన్నారు.
వ్యాక్సిన్ వేయించుకున్న ఎంపీ బండా ప్రకాష్
న్యూశాయంపేట: రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాష్ సతీసమేతంగా గురువారం హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రిలో కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం దశల వారీగా అందిస్తున్న వ్యాక్సిన్ను అందరూ నిరభ్యరంతరంగా తీసుకోవచ్చని అన్నారు.
వంగరలో కొవిడ్ టీకా ప్రారంభం
భీమదేవరపల్లి: వంగర ప్రభుత్వాస్పత్రిలో గురువారం కరోనా టీకాను ప్రజలకు ఉచితంగా ఇచ్చినట్టు మెడికల్ ఆఫీసర్ స్వరూపరాణి తెలిపారు. గురువారం మొట్టమొదటిగా రంగయ్యపల్లి మాజీ సర్పంచ్ భీంరెడ్డితో పాటు మరో 30మందికి టీకా వేసినట్లు తెలిపారు.