భర్త ప్రవర్తనతో విసిగిపోయి ఆ రాత్రి అత్తగారి దగ్గర పడుకున్న భార్య.. తెల్లారాక అతడిని అలా చూసి షాక్..

ABN , First Publish Date - 2021-11-13T23:59:57+05:30 IST

ఆ దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు. పెళ్లైనప్పటినుంచి ఆ భర్త ప్రతిరోజూ మద్యం సేవించి ఇంటికి వచ్చేవాడు. పిల్లలు పుట్టిన తర్వాత కూడా అతడి ప్రవర్తనలో మార్పు రాలేదు. దీంతో విసిగిపోయిన

భర్త ప్రవర్తనతో విసిగిపోయి ఆ రాత్రి అత్తగారి దగ్గర పడుకున్న భార్య.. తెల్లారాక అతడిని అలా చూసి షాక్..

ఆ దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు. పెళ్లైనప్పటినుంచి ఆ భర్త ప్రతిరోజూ మద్యం సేవించి ఇంటికి వచ్చేవాడు. పిల్లలు పుట్టిన తర్వాత కూడా అతడి ప్రవర్తనలో మార్పు రాలేదు. దీంతో విసిగిపోయిన భార్య ఆ రాత్రి అత్తగారి గదిలోకి వెళ్లి పడుకుంది. తెల్లారాక భర్త కోసం వెతకగా అతడిని అలా చూసి ఆ భార్య షాకైంది. పూర్తి వివరాల్లోకెళ్తే..


మధ్యప్రదేశ్‌లోని బరేలా ప్రాంతానికి చెందిన 33 ఏళ్ల రాంచందర్ పటేల్‌కు గతంలోనే జానకి పటేల్‌తో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. మద్యానికి బానిసైన రాంచందర్ ప్రతిరోజూ తాగి ఇంటికి వచ్చి భార్యతో గొడవపడేవాడు. పిల్లలు పుట్టిన తర్వాత కూడా అతడు మారలేదు. జానకి అనేకసార్లు అతడికి అర్థమయ్యేలా చెప్పినా ప్రవర్తనలో మార్పు లేదు. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి తప్పతాగి వచ్చిన రాంచందర్ మరోసారి తల్లి, భార్యతో వాగ్వాదానికి దిగాడు. దీంతో విసిగిపోయిన జానకి అత్తగారి దగ్గర పిల్లలతో కలిసి పడుకుంది. కోపంతో రాంచందర్ ఆ రాత్రి ఏం తినకుండా వేరే గదిలో పడుకున్నాడు. ఆ సమయంలోనే అతడు అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. గదిలోనే ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 


శనివారం ఉదయం లేవగానే జానకి భర్త కోసం గదిలో వెతికింది. అక్కడ బెడ్ మీద అతడు కనిపించలేదు. వెంటనే పక్కన ఉన్న గదిలో చూడగా.. అక్కడ భర్త ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. రాంచందర్‌ని అలా చూసి ఆమె బిగ్గరగా ఏడవడం ప్రారంభించింది. ఆమె అరుపులు విని చుట్టుపక్కన వారందరూ అక్కడకు చేరుకున్నారు. స్థానికుల సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని కిందకు దించి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నామన్నారు. 

Updated Date - 2021-11-13T23:59:57+05:30 IST