బండి సంజయ్పై కేసు కొట్టివేత
ABN , First Publish Date - 2021-03-11T00:37:34+05:30 IST
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్పై నమోదైన కేసును
హైదరాబాద్: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్పై నమోదైన కేసును ప్రజా ప్రతినిధుల కోర్టు కొట్టివేసింది. రెచ్చగొట్టేలా ప్రవర్తించారని 2018లో కరీంనగర్లో బండి సంజయ్పై కేసు నమోదయింది. సాక్ష్యాలు రుజువు కాకపోవడంతో సంజయ్పై కేసును ప్రజా ప్రతినిధుల కోర్టు కొట్టివేసింది. అలాగే వేర్వేరు కేసుల్లో బండి సంజయ్, రాజాసింగ్, కాలేరు వెంకటేష్, సంపత్కుమార్ ప్రజా ప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు.