ధోనీకి నెగెటివ్
ABN , First Publish Date - 2020-08-14T09:01:41+05:30 IST
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ కరోనా టెస్టు చేయించుకోగా నెగెటివ్గా తేలింది. బుధవారం రాంచీలోని ఓ స్థానిక ల్యాబ్లో అతడి నుంచి శాంపిల్ తీసుకోగా గురువారం...
రాంచీ: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ కరోనా టెస్టు చేయించుకోగా నెగెటివ్గా తేలింది. బుధవారం రాంచీలోని ఓ స్థానిక ల్యాబ్లో అతడి నుంచి శాంపిల్ తీసుకోగా గురువారం ఫలితాన్ని వెల్లడించారు. దీంతో మహీ శుక్రవా రం చెన్నైకి వెళ్లనున్నాడు. ధోనీతో పాటు పరీక్ష చేయించు కున్న సీఎ్సకేకే చెందిన మరో ఆటగాడు మోను కుమార్కు కూడా నెగెటివ్గా తేలింది. కాగా బౌలింగ్ కోచ్ బాలాజీ నేతృ త్వంలో ఈనెల 15 నుంచి 20 వరకు చెన్నై శిక్షణ శిబిరం కొనసాగనుంది. అయితే, అంతకన్నా ముందు ఆటగాళ్లంతా తమ స్వస్థలాల్లో కొవిడ్ టెస్టులు చేయుంచుకోవాల్సి ఉంది. నెగెటివ్ వస్తేనే క్యాంపులోకి అనుమతి లభిస్తుంది.