11న టీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల ధర్నా: పల్లా
ABN , First Publish Date - 2022-04-08T22:35:33+05:30 IST
ఈనెల 11న టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ధర్నా చేస్తారని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ
ఢిల్లీ: ఈనెల 11న టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ధర్నా చేస్తారని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కక్షసాధింపుతో కేంద్రం రైతుల ఉసురు తీస్తోందని దుయ్యబట్టారు. కేంద్రం తెలంగాణ నుంచి ధాన్యం సేకరించాలని డిమాండ్ చేశారు. లేదంటే కేంద్రం తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీకి తలా తోక లేదని పల్లా రాజేశ్వర్రెడ్డి ఎద్దేవాచేశారు.
ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ ఆధ్వర్యంలో బుధవారం ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు జాతీయ రహదారుల దిగ్బంధించిన విషయం తెలిసిందే. వరి కంకులు చేతపట్టి రహదారులపై బైఠాయించారు. ప్రధాని మోదీ తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పి, యాసంగి ధాన్యాన్ని కొంటామని ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. అన్ని రాష్ట్రాల్లో ధాన్యాన్ని కొని, తెలంగాణలో మాత్రం ఎందుకు కొనరని ప్రశ్నించారు. కేంద్రం తెలంగాణపై కక్ష కట్టినట్లు వ్యవహరిస్తోందని ఆరోపించారు